మంగళగిరిలో ఏపీ పోలీసు హెడ్‌క్వార్టర్స్

ఆంధ్రప్రదేశ్‌ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ భవనం(డీజీపీ ఆఫీస్)ను ముఖ్యమంత్రి చంద్రబాబు 16-Aug-2017 లో ప్రారంభించారు. గుంటూరు జిల్లా మంగళగిరి ఏపీఎస్పీ ఆరో పటాలంలో దాదాపు ఆరెకరాల విస్తీర్ణంలో ఈ భవనాన్ని నిర్మించారు. సుమారు రూ.40 కోట్ల వ్యయంతో లక్షా పది వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అయిదు ఫ్లోర్లతో ఈ భవన సముదాయాన్ని నిర్మించారు.  2016 అక్టోబరులో హోమ్‌ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప పోలీసు హెడ్‌క్వార్టర్స్‌ నిర్మాణానికి భూమిపూజ చేశారు. యుద్ధప్రాతిపదికన పనులను జరిపించి కేవలం పదే నెలల్లో భవన నిర్మాణాలను పూర్తిచేయడం విశేషం.

Post a Comment

 
Top