తాడేపల్లి మునిసిపల్ ఎన్నికల్లో విజేతలు వీరే


* తొలి పురబరిలో వైసీపీనే విజేత

తొలిసారిగా తాడేపల్లి పురపాలక సంఘానికి జరిగిన ఎన్నికల్లో వైసీపీ జయకేతనం ఎగురవేసింది. ఆపార్టీకి చెందిన 23 మంది కౌన్సిలర్లలో 18 మంది విజయం సాధించడం జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 

టీడీపీ అభ్యర్థులు వీరే..

మునిసిపాలిటీలోని 18వ వార్డు నుంచి సైకం నీలిమాదేవి, 20వ వార్డు నుంచి ఇట్టా భాస్కర్, 21వ వార్డు నుంచి చిన్నపోతుల సుబ్బారావు (చిన్నా)లు గెలుపొందారు.

కాంగ్రెస్, ఇండిపెండెంట్‌కు చెరొకటి

తాడేపల్లి పురపాలక సంఘ ఎన్నికల్లో ఒకే ఒక్క వార్డుతో కాంగ్రెస్ పార్టీ సరిపెట్టుకుంది. ఏడో వార్డు నుంచి ఆ పార్టీ అభ్యర్థిని చింతపల్లి సుమలత విజయం సాధించారు. కాగా, 14వ వార్డు నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థినిగా జమళ్లమూడి విజయలక్ష్మి విజయం సాధించారు.



Post a Comment

 
Top